మూడు రాజధానులు వద్దు అంటూ కాకినాడలో వినూత్న నిరసన

Update: 2020-01-02 13:11 GMT

మూడు రాజధానులు వద్దు... ఒక్క రాజధాని ముద్దు అంటూ.. .తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వినూత్న నిరసన చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇంద్రాపాలెం లాకుల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని... అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ మౌన ప్రదర్శనలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, జనసేన, సీపీఐ నేతలు పాల్గొన్నారు. అధికార వికేంద్రీకరణ పేరుతో సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చినరాజప్ప ఆరోపించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 4న బాలాజీ సెంటర్‌లో వంటావార్పు నిర్వహిస్తామన్నారు.

Similar News