సిరిసిల్ల శివారుకు మధ్యమానేరు నీళ్లు : మంత్రి కేటీఆర్‌

Update: 2020-01-02 14:09 GMT

పల్లెలు బాగుపడితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమౌతుందన్న సీఎం కేసీఆర్‌ మాటలను నిజం చేస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. ఇప్పటికే సిరిసిల్ల శివారుకు మధ్యమానేరు నీళ్లు చేరుకున్నాయని పేర్కొన్నారు. సాగు, త్రాగు నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. మోహినికుంటలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లితో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. తన తాతగారి ఊరైన ఈ గ్రామాన్ని అన్ని విదాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పల్లె ప్రగతికి ధీటుగా పట్టణ ప్రగతి చేపడతామని తెలిపారు.

Similar News