జగన్ ఆస్తుల కేసుపై సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనవరి 10న జరిగే విచారణకు A1 జగన్, A2 విజయసాయిరెడ్డి హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణ నుంచి మినహాయింపు కోరడంపై స్పందించిన కోర్టు.. పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే 12 సార్లు మినహాయింపు ఇచ్చామని ఇక మీద వీలుకాదని చెప్పింది. చాలామంది ప్రజా ప్రతినిధులపై కేసులున్నాయని.. వాళ్లంతా కోర్టుకు విధిగా హాజరవుతున్నారని ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదని కోర్టు తెలిపింది. జగన్ కూడా అందుకు అతీతులు కాదని సీబీఐ కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.