చంద్రబాబు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు : మంత్రి బొత్స

Update: 2020-01-04 15:26 GMT

చంద్రబాబు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదన్నారు మంత్రి బొత్స. ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు ఉసిగొల్పుతున్నారన్నారు. అమరావతి రైతుల దగ్గర చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ విమర్శించారు. అమరావతి రాజధానికి పనికిరాదని శివరామకృష్ణ న్‌ కమిటీనే చెప్పిందని, కానీ ఆ కమిటీ నివేదికను చంద్రబాబు అసలు చదవలేదన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను తుంగలో తొక్కి నారాయణతో కమిటీ వేశారన్నారు. మరో 3 వేల కోట్లతో రాజధాని పూర్తవుతుందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు బొత్స.

Similar News