ESI స్కామ్లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. లెజెండ్ షెల్ కంపెనీకి కృపాసాగర్ను ఓమ్ని చైర్మన్ శ్రీహరిబాబు అలియాస్ బాబ్జి బినామీగా చేర్చినట్టు అధికారుల విచారణలో తేలింది. క్యూ వైట్ అనే వైట్ బ్లడ్ శాంపిల్స్ గోల్మాల్లో 2017-18 సంవత్సరంలో 23 కోట్ల విలువగల 6 వేల 291 యూనిట్లను పంపినట్టు డాక్యుమెంట్స్ లభించాయి. అసలు ధర కంటే 2 వందల శాతం ఎక్కువ ధరకు క్యూవేట్ పరికరాలను సంస్థ విక్రయించినట్టు తేలింది. అసలు ధర 11 వేల 8 వందలు ఉంటే... 36 వేల 8 వందలకు అమ్మి సర్కారీ సొమ్మును కాజేశారు అక్రమార్కులు. దీంతో...11 కోట్ల ప్రభుత్వ సొమ్మును శ్రీహరి అండ్ కో అడ్డంగా దోచేశారు.
డ్రగ్ కంట్రోల్, కమర్షియల్ టాక్స్, అఫీస్ అడ్రెస్కు సంబంధించిన 3 వేర్వేరు అడ్రెస్లను లెజెండ్ కంపెనీ నమోదు చేసింది. స్విట్జర్లాండ్ కంపెనీ అయిన హీమోక్యూ కంపెనీలో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్న వెంకటేశ్... కంపెనీకి తెలియకుండా ఫేక్ ఆథరజైసేన్ లెటర్ తయారు చేసినట్టు తేలింది. ఈ వ్యవహారంలో ఓమ్మి చైర్మన్ శ్రీహరిబాబు, హిమోక్యూ ఏరియా మేనేజర్ వెంకేటేష్ను అరెస్టు చేసి ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు లెజెండ్ కంపెనీ యజమానిగా ఉన్న కృపాసాగర్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. కృపాసాగర్ను విచారిస్తే.. మరిన్ని అక్రమాలు బయపటడే అవకాశం ఉంది.