జగన్ రూపంలో ఏపీకి దరిద్రం పట్టింది: దివ్యవాణి

Update: 2020-01-07 08:38 GMT

జగన్‌ ఈవీఎం సీఎం అని.. ప్రజాభిమానం పొందిన సీఎం కాదని టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఆరోపించారు. గత ఏడు నెలలుగా జగన్‌ రూపంలో ఏపీకి దరిద్రం పట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రోజు రాజకీయాల్లో జోక్యం చేసుకోని నారా భువనేశ్వరిపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మాటకు ముందు వెనుక దేవుడు ఉన్నాడని చెప్పుకునే జగన్‌ కు‌.. ధైర్యముంటే తిరిగి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు.

Similar News