రెండో టీ20.. ఇండియా లక్ష్యం 143

Update: 2020-01-07 15:22 GMT

ఇండోర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపింది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక ఆదిలోనే తడబడింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకే చేతులేత్తేసింది. భారత బౌలర్లు విజృంభించడంతో లంక ఆటగాళ్లు తేలిపోయారు.

Similar News