వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి కేసులో తాడికొండకు చెందిన కొందరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారికోసం ఎంపీ గల్లా జయదేవ్ , నక్కా ఆనందబాబు, పుల్లారావు , జీవీ ఆంజనేయులు మంగళగిరి స్టేషన్కు వెళ్లారు. అయితే రైతులను తాము అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.