అమరావతి రైతులకు మద్దతుగా జనసేన సామూహిక దీక్ష

Update: 2020-01-08 07:03 GMT

అమరావతి రైతుల ఆందోళనలకు అన్ని పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. జనసేన కూడా నేరుగా రైతుల నిరసనల్లో పాల్గొంటోంది. జనసేన విజయవాడ పశ్చిమ ఇంఛార్జ్‌ పోతిన మహేష్‌ ఆధ్వర్యంలో సామూహిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, జేఏసీ నేతలు పాల్గొన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని నేతలు డిమాండ్‌ చేశారు.

Similar News