రాజధాని ఉద్యమాన్ని పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్నారు: ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్
రాజధాని ఉద్యమం.. నిజమైన రైతులు చేస్తోన్న ఉద్యమం కాదన్నారు ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్. రైతుల పేరుతో పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న ఉద్యమమన్నారాయన. వాళ్లు రైతులే అయితే ఆడికార్లు, ఖద్దరు షర్టులు, బంగారు గాజులతో నిరసనల్లో పాల్గొంటారా అని ప్రశ్నించారు. పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖానికి రంగేసుకునే పృథ్వీరాజ్.. ముఖం కడుక్కోకుండానే భోజనం చేస్తారని.. కానీ రైతులు బురదలో దిగినా.. శుభ్రంగా కడుక్కుని భోజనం చేస్తారంటూ కౌంటర్ ఇచ్చారు.