ఆడ బిడ్డలను మగ పోలీసులు కొడతారా?- చంద్రబాబు

Update: 2020-01-10 16:18 GMT

రాష్ట్రం మొత్తం ఒకే నినాదం.. అదే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతి అంటే తెలుగు ప్రజల గౌరవం అన్న చంద్రబాబు.. చరిత్రలో ఇలాంటి తుగ్లక్‌ పాలన ఎక్కడా చూడలేదన్నారు. నాజీవితంలో ఎప్పుడూ జోలె పట్టలేదని.. కానీ అమరావతి కోసం పట్టానని చెప్పారు. ఆడ బిడ్డలను మగ పోలీసులు కొడతారా అని చంద్రబాబు మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో జరిగిన అమరావతి పరిరక్షణ యాత్ర సభలో పాల్గొన్న టీడీపీ అధినేత.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

 

Similar News