మహిళా రైతుల నిర్బంధంపై మరోసారి స్పందించారు జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న మహిళలను నిర్బంధించి సాయంత్రం ఆరు దాటిన విడుదల చేయకపోవడంపై ఆమె ట్విట్టర్లో స్పందించారు. తనకు అరెస్టైన మహిళలను నుంచి వందలాది సందేశాలు అందుతున్నాయని.. వెంటనే మహిళలను విడుదల చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ.