విజయవాడ ధర్నాచౌక్లో అమరావతి పరిరక్షణ సమితి నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఎంపీ కేశినేనినాని, ఎమ్మెల్సీ అశోక్బాబు, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వర్రావు దీక్ష శిబిరాన్ని సందర్శించారు. అటు క్యాబ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది. అమరావతి కోసం పార్టీలకు అతీతంగా పోరాడం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. సీఎం జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.