తుళ్లూరులో రాజధాని రైతుల దీక్షాశిబిరాన్ని బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి మాలతీరాణితో పాటు సుప్రీం కోర్టు లాయర్ల బృందం సందర్శించింది. లాఠీఛార్జ్లో గాయపడిన మహిళలను పరామర్శించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా పోరాటం చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని అన్నారు. అమరావతిలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.