రైతులపై తరచూ లాఠీఛార్జీలు చేస్తున్నారని ఎన్‌హెచ్‌ఆర్సీకి కనకమేడల ఫిర్యాదు

Update: 2020-01-13 14:03 GMT

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారంటూ.. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌.. జాతీయ మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాత్రిపూట గ్రామాల్లో కవాతులు చేస్తూ.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని.. పోలీసుల అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని.. కనకమేడల NHRC ని కోరారు.

 

Similar News