తెలంగాణ గవర్నర్ తమిళిసై.. పొంగల్ వేడుకల్ని సొంత రాష్ట్రం తమిళనాడులో ఘనంగా జరుపుకున్నారు. చెన్నైలో బంధు, మిత్రుల మధ్య ఉల్లాసంగా గడిపారు. తెలుగు ప్రజలతోపాటు.. తమిళనాడు వాసులకు తమిళిసై పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మధ్య వారధిగా ఉండేందుకు కృషి చేస్తానని తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు తమిళిసై.