రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలన్నారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. జనసేన-బీజేపీ కలయిక కీలక పరిణామమన్నారు. ఆ రెండు పార్టీలు రాజధాని కోసం ఏం చేస్తాయని ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారన్నారు. బీజేపీ తలుచుకుంటే రాజధాని అమరావతి సమస్య వారికి చాలా చిన్నదని.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. అమరావతిపై బీజేపీ నిర్ణయాన్ని బట్టి ఏపీలో వారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.