అమరావతి ఉద్యమాన్ని ఎంత అణచివేయాలనుకుంటే అంత ఎగసిపడుతుందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదన్నారు.. అమరావతిలో ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా ఉండవల్లిలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ బ్యాలెట్ కార్యక్రమానికి హాజరైన ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ రాజధాని ఏదని చెప్పుకోలేకుండా సీఎం చేశారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులపై అక్రమ కేసు పెట్టడాన్ని తప్పు పట్టారు.