అయిదు రోజుల పాటు మందు బంద్..

Update: 2020-01-18 10:52 GMT

అయ్‌బాబోయ్ ఎలా అంటే.. మందు పోయించినోడికే ఓటంటారేమోనని.. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఐదు రోజులు మద్యం దుకాణాలు మూసేస్తున్నారు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో. అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల సంఘం ఇటువంటి ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 6 సాయింత్రం నుంచి ఢిల్లీలో ప్రచారం ముగియనుంది. అందుకే ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఇక ఫిబ్రవరి 9న గురు రవిదాస్ జయంతి కారణంగా మద్యం షాపులు మూసివేస్తారు. అలాగే ఫిబ్రవరి 10న కూడా కొంత సమయం మాత్రం దుకాణాలు తెరుస్తారు. ఇక 11న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపధ్యంలో ఆ రోజు కూడా మద్యం బంద్. సో.. మొత్తంగా అయిదు రోజులు మందు బాబులకు సెలవులు ప్రకటించింది ఎన్నికల సంఘం.

Similar News