సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మొనగాడో, మోసగాడో తేల్చుకోవాలి : తులసీరెడ్డి

Update: 2020-01-19 10:47 GMT

ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మొనగాడో, మోసగాడో తేల్చుకోవాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసీరెడ్డి సవాల్‌ విసిరారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాహుకేతువుల్లా మారారని ఆయన కడపలో విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధానిని స్వాగతిస్తున్నామన్న జగన్‌.. ఇప్పుడు రాజధానిని మార్చడం భావ్యం కాదన్నారు. ఒకవేళ కేపిటల్‌ మార్చాలనుకుంటే... ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని తులసీరెడ్డి డిమాండ్‌ చేశారు.

Similar News