మూడు రాజధానులు వద్దు అమరావతి రాజధాని కావాలంటూ హోంమంత్రి సుచరిత ఇంటిని జేఏసీ నేతలు ముట్టడించారు. తన అనుచరులతో సుచరిత ఇంటికి బయలు దేరిన మాజీ మంత్రి ఆలపాటి రాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అటు మందడంలో పోలీస్ యాక్షన్పై వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆందోళకు దిగారు.