అసెంబ్లీలో ప్రభుత్వ వ్యవహార శైలిపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ రూలింగ్ లేకుండానే.. సీఎం ఆదేశాల మేరకు మార్షల్ రావడం ఏంటని సీనియర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రశ్నించారు. ఇలాంటి పరిణామం ఎప్పుడూ చూడలేదని అన్నారాయన. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చినరాజప్ప తెలిపారు.