పేద విద్యార్థుల కోసం ప్రభుత్వబడుల్లో ఇంగ్లీష్ మీడియం తెస్తున్నాం: సీఎం జగన్

Update: 2020-01-23 15:29 GMT

పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తెస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఇంగ్లీష్‌ మీడియం బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజన మెనూ తెస్తున్నట్టు జగన్ వివరించారు. ఈ బిల్లు ఇప్పటికే ఓసారి అసెంబ్లీ ఆమోదించగా మండలి తిప్పిపంపింది. కొన్ని సవరణలు సూచించింది. వాటిని అసెంబ్లీ తోసిపుచ్చింది. పాత బిల్లుకు మరోసారి ఆమోదం తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లిష్ మీడియం అవసరమని జగన్ అన్నారు.

Similar News