అసెంబ్లీలో మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని టీడీపీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఖండించారు. ఛానెళ్లపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు.. టీవీ 5ను ఎందుకు నిషేధించారని యనమల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము ఇలా వేధించాలనుకుంటే సాక్షి మీడియాను వందసార్లు ప్రశ్నించి ఉండేవాళ్లమని అన్నారు. ప్రజల కోసం వార్తలు రాసే మీడియాను కూడా టార్గెట్ చేస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.