కేంద్రమంత్రి నరేంద్ర తోమర్కి చంద్రబాబు లేఖ రాసారు.. నరేగా పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ నాలుగు పేజీల లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. నిధుల విడుదల చేయకుండా పెండింగ్లో ఉంచిందని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే గతంలో నరేగా పనులు చేసిన వారిపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ చంద్రబాబు లేఖ రాశారు.