క్విడ్ ప్రోకో కేసులో ఏపీ సీఎం జగన్ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కాలేదు. ఇదే కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరయ్యారు. అటు.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, వీడీ రాజగోపాల్ ఆలస్యంగా వచ్చారు. ఈడీ హాజరు మినహాయింపు పిటిషన్పై కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. జగన్ హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తరపు లాయర్ ఆబ్సెంట్ పిటిషన్ వేశారు.