గణతంత్ర దినోత్సవాలకు దేశం ముస్తాబైంది. 71వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాజ్పథ్లో రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ కనువిందు చేశాయి. వివిధ విభాగాలు తమ విన్యాసాలతో కట్టిపడేశాయి.
రిపబ్లిక్ డే పరేడ్కు రాజ్పథ్ పెట్టింది పేరు. సైనికుల కవాతు, జవాన్ల విన్యాసాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఐఏఎఫ్, నేవీ సహా అన్ని కీలక విభాగాలు పరేడ్లో పాల్గొంటాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ విభాగా ల శకటాల ప్రదర్శన కూడా హైలెట్గా నిలుస్తుంది.