ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయంలో ఎలాంటి కేసులకైనా సిద్ధమే: ప్రత్తిపాటి పుల్లారావు

Update: 2020-01-24 20:27 GMT

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విషయంలో ఎలాంటి కేసులకైనా సిద్ధమేనన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. తప్పుడు కేసులకు భయపడబోమన్నారు. తుళ్లూరులో రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలకు ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం రైతుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వం, అధికారులపై న్యాయపోరాటం చేస్తామని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

Similar News