జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై

Update: 2020-01-26 13:37 GMT

హైదరాబాద్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన తమిళిసై.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తన ప్రసంగంలో వివరించారు.

Similar News