మండలి రద్దు నిర్ణయంపై వైసీపీ పునరాలోచించాలి: ఎమ్మెల్సీ మాధవ్

Update: 2020-01-27 17:07 GMT

ఏపీ శాసన మండలి రద్దు దురదృష్టకరమని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. తన తండ్రి పునరుద్ధరించిన మండలిని తనయుడు జగన్ రద్దు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధానికి బీజేపీ కట్టుబడి వుందని తెలిపారు. వైసీపీ సర్కార్ నిర్ణయంపై అవసరమైతే పోరాటం చేస్తామని మాధవ్ స్పష్టం చేశారు.

Similar News