జగన్ ప్రభుత్వ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో టీడీపీ

Update: 2020-01-28 18:43 GMT

ఏపీలో జగన్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. రాజధాని మార్పు, 3 రాజధానుల ప్రకటన, మండలి రద్దు.. మొదలైన అంశాలపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అలాగే ఉపాధి హామీ పథకం నిధుల మళ్లింపు, మీడియాపై ఆంక్షలు, పోలవరం పనుల నిలిపివేత, అక్రమ కేసులపైనా సమావేశంలో చర్చించారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో.. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఎంపీలు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.

 

Similar News