శాసనమండలిలో రాజ్యాంగ బద్దంగా వ్యవహరించామన్నారు టీడీపీ నేత యనమల. నిబంధనల ప్రకారమే బిల్లును సెలక్ట్ కమిటీకు పంపించామని.. దీన్ని సీఎం జగన్ సహించలేకపోతున్నారన్నారు. సెలక్ట్ కమిటీకు పంపించడమంటే బిల్లును అడ్డుకోవడం కాదని, ప్రజాభిప్రాయాన్ని సేకరించడమన్నారు. రెండేళ్లుగా 10 రాష్ట్రాలకు చెందిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయిన్నారు. దీన్ని బట్టి మండలి రద్దయ్యేందుకు రెండేళ్లుపైనే పడుతుందన్నారు.