మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా లంగర్ హౌస్లోని బాపుఘాట్ దగ్గర ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై బాపు ఘాట్ దగ్గర ఆయన విగ్రహానికి పూల మాల వేసి.. తరువాత నివాళులర్పించారు. గవర్నర్తో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు బాపూఘాట్లో నివాళులర్పించారు.