46 రోజులుగా రాజధాని గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తుంటే సీఎం జగన్కు చీమకుట్టినట్టైనా లేదని మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి నిప్పులు చెరిగారు. వారి బాధలు తెలుసుకునే బాధ్యత లేదా అంటూ నిలదీశారు. చంద్రబాబు మీద కోపం రైతులపై చూపించడం సమంజసం కాదన్నారు. వాళ్లేం పాపం చేశారని ప్రశ్నించారు. ఏది ఏమైనా ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని పేర్కొన్నారు.