మహిళలు అన్నిరంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. వివాహం అయిన తర్వాత చదువు ఆపకుండా.. అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఓయూ ఆంధ్రమహిళా సభ ఐదవ గ్రాడ్యుయేషన్ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.