చిరంజీవితో భేటీ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్

Update: 2020-02-04 20:27 GMT

హైదరాబాద్‌లో సినీ నటులు చిరంజీవి, నాగార్జునతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజివి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సినిమా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇందులో చర్చించారు. ఫిల్మ్‌ ఇండస్ట్రీ సమస్యలపై సినీ పెద్దలతో చర్చిస్తామని గతంలోనే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఆదేశాల మేరకు చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని భేటీ అయ్యారు.

Similar News