హైకోర్టు అక్షింతలు వేస్తున్నా ప్రభుత్వ వైఖరి మారడంలేదు: బీజేపీ విశ్వనాధరాజు

Update: 2020-02-07 19:27 GMT

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని మండిపడ్డారు బిజేపీ రాష్ట్ర కార్యదర్శి విశ్వనాధరాజు. మూడు రాజధానుల వలన ప్రజాధనం వృధా తప్ప మరొకటి కాదని ఆయన విశాఖలో విమర్శించారు. శాసన సభ, సచివాలయం అమరావతిలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమా పరిశ్రమకు విశాఖ అనుకూలమని.. అక్కడ సినీపరిశ్రమ అభివృద్దిచేయాలన్నారు. హైకోర్టు అక్షింతలు వేస్తున్నా ప్రభుత్వ వైఖరి మారడంలేదని విశ్వనాధ రాజ్ ధ్వజమెత్తారు.

Similar News