ఆంధ్రుల రాజధాని అమరావతి మాత్రమే: శివాజీ

Update: 2020-02-08 13:56 GMT

సినీ నటుడు శివాజీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు శివాజీని పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. రాజధాని ఎక్కడికి పోదని.. ఆంధ్రుల రాజధాని అమరావతి మాత్రమేనని శివాజీ స్పష్టం చేశారు. ప్రభుత్వం తన ఇష్టం వచ్చిన చోటు నుంచి పరిపాలించుకోవచ్చని.. ఆ స్వేచ్ఛ పాలకులకు ఉంటుందని అన్నారు. అయితే.. ప్రజలు మాత్రం రాజధానిగా అమరావతే ఉండాలని కోరుకుంటున్నారని శివాజీ పేర్కొన్నారు.

Similar News