కర్నూలులో హైకోర్టు తాను వ్యతిరేకం కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అయితే కేవలం హైకోర్టుతోనే అభివృద్ధి జరగదన్నారాయన. పెట్టుబడులు వస్తేనే కర్నూలు అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక నేతలు... వాటా అడగడం వల్ల రాయలసీమలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని.... అందుకే రాయలసీమ అభివృద్ధి చెందడం లేదన్నారు. చదువుకున్న యువకులు... తమకు ఉపాధి లేదనే ఆవేదన చెందుతున్నారన్నారు పవన్ కల్యాణ్.