చిత్ర పరిశ్రమకు అమరావతి సెగ

Update: 2020-02-08 13:46 GMT

రాజధానిగా అమరావతి కోసం జేఏసీ ఉద్యమం ఉధృతమైంది. 53 రోజులుగా చేస్తున్న రైతుల ఉద్యమానికి ప్రజలందరి మద్దతు లభిస్తోంది. ఉద్యమానికి సినీపరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని అమరావతి జేఏసీ డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ముందు విద్యార్ధి యువజన జేఏసీ నేతల ఆందోళన తలపెట్టింది. 53 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా సినీ ఇండస్ట్రీ ఏ మాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి సినీ పరిశ్రమ మద్దతు తెలిపాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Similar News