తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, గాయకుడు శ్రీకృష్ణ స్వామివారి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి పట్టువస్త్రాలతో సత్కరించారు.