ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న సీఎం జగన్ తీరుకు నిరసనగా.. అనంతపురం జిల్లా కదిరిలో జేఏసీ నాయకులు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ రివర్స్ పాలన సాగిస్తున్నారంటూ.. వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే రివర్స్ పాలన ఆపి.. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.