మందడంలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణాయపాలెం శిబిరంపై దుండగుడు మందు సీసా విసరడంతో కలకలం రేగింది. ఆర్టీసీ బస్సులో నుంచి మందు సీసా విసరడంతో.. మందడంలో బస్సును ఆపి ఆందోళనకు దిగారు. బాటిల్ విసిరిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కావాలనే కొందరు వ్యక్తులతో ఇలాంటివి చేయిస్తున్నారని మండిపడుతున్నారు.