ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో చట్ట బద్ధత కల్పించిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని.. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చకు సిద్ధమేనా అని లక్ష్మణ్ సవాల్ విసిరారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం.. ఆయన చదువుకున్న ప్రాంతాలను పర్యాటక కేంద్రాలు మారుస్తున్నారని తెలిపారు.