వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ తప్పు పట్టారు. చంద్రబాబు అమరావతి రాజధానిగా నిర్ణయించినప్పుడు జగన్ స్వాగతించారని గుర్తు చేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు తన ప్రసంగంలో రాజధాని మార్పుపై ఎందుకు ప్రస్తావించలేదని జగన్ ప్రశ్నించారు శైలజానాథ్. అందరికీ అనువైన చోట రాజధాని ఉండాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశమని స్పష్టం చేశారు. వైఎస్ ఆశయాలపై జగన్కు గౌరవం లేదని శైలజానాథ్ మండిపడ్డారు.