దేవస్థానంలో రథానికి నిప్పంటించిన దుండగులు

Update: 2020-02-14 13:24 GMT

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కొండ బిట్రగుంటలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఉన్న రథానికి దుండగులు నిప్పు పెట్టారు. రాజకీయ కక్షలే దీనికి కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి వెల్లంపల్లి.. నెల్లూరు జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. రథానికి నిప్పు పెట్టడంపై భక్తులు మండిపడుతున్నారు.

Similar News