చంద్రబాబు, లోకేష్ల బినామీ ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు మంత్రి బొత్స. ఈ సోదాలతో చంద్రబాబు అవినీతి తేటతెల్లమైందన్నారు. అమరావతిని రియల్ ఎస్టేట్ బిజినెస్లా మార్చారని విమర్శించారు. ఇంతా జరుగుతుంటే చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు బొత్స. రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధే కాని.. అవినీతి కాదన్నారు. టీడీపీ హయాంలో కాంట్రాక్టుల పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. అందుకే రివర్స్ టెండరింగ్కు వెళ్లామని అన్నారు బొత్స.