పల్లె ప్రగతితో గ్రామాలకు పట్టిన శనిపోయిందన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్రావు. కేసీఆర్ పాలనలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయయన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో పంచాయతీరాజ్ సమ్మేళనం జరుగుతుందని, మొదటి సమ్మేళనం సంగారెడ్డి జిల్లాలోనే జరిగిందన్నారు. త్వరలో గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మంచిగా పనిచేసినవారికి ప్రశంసలు, పనిచేయనివారిపై చర్యలు తప్పవని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.