రాజధాని గ్రామాల్లో TNSF ఆధ్వర్యంలో విద్యార్థుల బస్సు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర, ఎస్వీ, ఎస్కే, రాయలసీమ, నాగార్జున యూనివర్సిటీలతో పాటు..వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటిస్తోంది. మందడం వచ్చిన విద్యార్థులు.. రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. తిరుమలలో ప్రత్యేక పూజలు చేసిన తీర్థప్రసాదాలను..రాజధాని రైతులకు ఎస్వీ యూనివర్సిటీ ప్రతినిధుల బృందం అందజేసింది.