జగన్ ఆస్తుల వివరాలు చెప్పే ధైర్యం వైసీపీ వాళ్లకు ఉందా అని సవాల్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. జగన్ చెమటోడ్చి సంపాదించారా అని ప్రశ్నించారు. ఆయన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో అందరికీ తెలుసన్నారు. కమిషన్లు తీసుకుని జగన్.. పోలవరం నిర్మాణాన్ని వేరేవాళ్లకు అప్పగించారన్నారు. నిజం చెప్పే ధైర్యం లేక.. కావాలనే టీడీపీ టార్గెట్గా వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారన్నారు వర్ల రామయ్య.